Tollywood: అందమైన ఆ ఆనంద క్షణాలు ఎంతో వేగంగా గడిచిపోయాయి.. సమంత పోస్ట్

Sam Meets Her Closest Friend
  • క్లోజ్ ఫ్రెండ్ శిల్పారెడ్డిని కలిసిన హీరోయిన్
  • డెహ్రాడూన్ పర్యటనలో సామ్.. ఇన్స్టాలో పోస్ట్
  • శిల్ప ఫ్యామిలీతో వారం పాటు సరదాగా గడిపిన సామ్
నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని తెంచుకున్న తర్వాత సమంత మళ్లీ మామూలు జీవితంలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే దసరారోజున తాను చేసే ప్రాజెక్టులను ప్రకటించింది. త్వరలోనే వాటి షూటింగులలో బిజీ కానుంది. ఆ లోపున్న ఖాళీ సమయాన్ని తన సన్నిహితులతో కలిసి గడుపుతోంది. అందులో భాగంగానే తన అత్యంత సన్నిహిత స్నేహితురాలిని ఆమె కలిసింది.

డిజైనర్ శిల్పారెడ్డి, ఆమె ఫ్యామిలీతో సరదాగా గడిపింది. నిన్న సాయంత్రం డెహ్రాడూన్ టూర్ కు వెళ్లింది. ఆ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అందం, సరదా, ఆనంద క్షణాల ఈ వారం ఎంతో వేగంగా గడిచిపోయిందంటూ పోస్ట్ పెట్టింది. ఫ్లైట్ లో దిగిన ఫొటోలను, డెహ్రాడూన్ లో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇక, అంతకుముందు శిల్పారెడ్డి ఫ్యామిలీతో సామ్ టగ్ ఆఫ్ వార్ ఆడిన సంగతి తెలిసిందే.

Tollywood
Samantha
Shilpa Reddy
Dehradun

More Telugu News