Corona Virus: దేశంలో కొత్త‌గా 23,529 క‌రోనా కేసులు

corona bulletin in inida
  •  మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980
  • నిన్న క‌రోనాతో 311 మంది  మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,48,062
  • కేరళలో నిన్న 12,161 కేసుల నమోదు 
దేశంలో కొత్త‌గా 23,529 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980కు చేరింది. దేశంలో తాజాగా 28,718 మంది కోలుకోగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,30,14,898 మంది కోలుకున్నారు.

ఇక నిన్న క‌రోనాతో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,48,062కి చేరింది. 2,77,020 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. కేర‌ళ‌లో కొత్త‌గా 12,161 మందికి క‌రోనా సోకింది. 155 మంది నిన్న ఆ రాష్ట్రంలో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Corona Virus
COVID19
India

More Telugu News