Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

corona bulletin in inida
  • కొత్త‌గా 18,870 మందికి క‌రోనా
  • కేసుల సంఖ్య మొత్తం 3,37,16,451
  • నిన్న‌ 378 మంది మృతి
  • మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,47,751  
దేశంలో కొత్త‌గా 18,870 మందికి క‌రోనా వైర‌స్‌ సోకింది. దీంతో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,37,16,451కి చేరింది. క‌రోనా నుంచి కొత్త‌గా 28,178 మంది కోలుకోగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,29,86,180 మంది రికవర్ అయ్యారు. క‌రోనాతో నిన్న‌ 378 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,47,751కు చేరింది.

ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,82,520 మందికి చికిత్స అందుతోంది. కేర‌ళ‌లో నిన్న 11,196 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 149 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నిన్న 54,13,332 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు వినియోగించిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 87,66,63,490 గా ఉంది.
Corona Virus
COVID19
India

More Telugu News