గుంటూరులో బీటెక్ విద్యార్థిని మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న నేతలు
- ముగిసిన పోస్టుమార్టం
- మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యుల ఏర్పాట్లు
- అడ్డుకుని ఆందోళనకు దిగిన టీడీపీ, వామపక్షాల కార్యకర్తలు
- కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్
దీంతో జీజీహెచ్ వద్ద గందరగోళం నెలకొంది. యువతిని చంపిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి వద్దే టీడీపీతో పాటు వామపక్షాల నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో మృతదేహాన్ని మరో మార్గం ద్వారా తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు, ఈ రోజు ఉదయం రమ్య కుటుంబ సభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చెక్కు అందజేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. రమ్యను హత్య చేసిన నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని ఆమె కుటుంబ సభ్యులు చరితను కోరారు.