Corona Virus: దేశంలో 111 రోజుల క‌నిష్ఠ స్థాయిలో న‌మోదైన కొత్త క‌రోనా కేసులు!

Media Bulletin on status of positive cases COVID19 in india
  • నిన్న‌ 34,703 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,19,932
  • నిన్న‌ 553 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 4,03,281
దేశంలో నిన్న కొత్త క‌రోనా కేసులు 111 రోజుల క‌నిష్ఠ‌ స్థాయిలో న‌మోద‌య్యాయి. నిన్న‌ 34,703 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 51,864 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 553 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,03,281కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,52,294 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 101 రోజుల క‌నిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 4,64,357 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,75,53,612 వ్యాక్సిన్ డోసులు వేశారు. క‌రోనా కేసుల రిక‌వ‌రీ రేటు 97.17 శాతంగా ఉంది.
Corona Virus
COVID19
India

More Telugu News