Corona Virus: నిన్న కూడా దేశంలో లక్ష లోపే కరోనా కొత్త కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india
  • దేశంలో నిన్న 94,052 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,91,83,121
  • మృతుల సంఖ్య మొత్తం 3,59,676  
  • 37,21,98,253 కరోనా పరీక్షలు  
దేశంలో నిన్న 94,052 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,51,367 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,91,83,121కు చేరింది. మరో  6,148 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,59,676కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,76,55,493 మంది కోలుకున్నారు. 11,67,952 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
            
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,21,98,253 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,04,690 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News