Corona Virus: దేశంలో నిన్న 1,32,364 క‌రోనా కేసుల న‌మోదు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,85,74,350 
  • మృతుల సంఖ్య మొత్తం 3,40,702  
  • మొత్తం  35,74,33,846 కరోనా పరీక్షలు
  • 22,41,09,448 మందికి వ్యాక్సిన్లు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న 1,32,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న 2,07,071 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. మరో  2,713  మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,40,702కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,65,97,655 మంది కోలుకున్నారు. 16,35,993 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,41,09,448 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  35,74,33,846 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,75,428 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News