Corona Virus: దేశంలో ఒక్క‌రోజులో కరోనాతో 4,529 మంది మృతి!

Media Bulletin on status of positive cases COVID19 in india
  • కొత్త‌గా 2,67,334  మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330
  • మృతుల సంఖ్య 2,83,248
  • 18,58,09,302 మందికి వ్యాక్సిన్లు              
భార‌త్‌లో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణిస్తోన్న వారి సంఖ్య ప్ర‌తిరోజు భారీగా న‌మోద‌వుతోంది. గడచిన 24 గంట‌ల సమయంలో ఎన్న‌డూలేని విధంగా 4,529  మంది కరోనా కారణంగా మృతి చెందారు. నిన్న‌ కొత్త‌గా 2,67,334 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది.

వాటి ప్రకారం... నిన్న 3,89,851 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,54,96,330కు చేరింది. మృతుల సంఖ్య 2,83,248కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,19,86,363 మంది కోలుకున్నారు. 32,26,719 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,58,09,302 మందికి వ్యాక్సిన్లు వేశారు.
            
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 32,03,01,177  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న  20,08,296 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News