రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court adjourns Raghu Rama Krishna bail petition to 12 PM
  • సుప్రీంలో రఘురాజు బెయిల్ పెటిషన్
  • రఘురాజు తరపున వాదించిన రోహత్గి, ఆదినారాయణరావు
  • సంబంధిత డాక్యుమెంట్లను కోర్టుకు అందించాలన్న సుప్రీం
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపించగా. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుశ్యంత్  దవే, వి. గిరి వాదించారు. వాదనల అనంతరం విచారణను సుప్రీంకోర్టు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోగా సంబంధిత డాక్యుమెంట్లను ఆన్ లైన్ ద్వారా కోర్టుకు అందించాలని ధర్మాసనం ఆదేశించింది.
Go Back to Shorts
Raghu Rama Krishna Raju
YSRCP
Bail
Supreme Court

More Telugu News