బెజవాడ కనకదుర్గ ఆలయ ఈవో సురేశ్ బదిలీ
- దుర్గ గుడిలో అక్రమాలు అంటూ ఆరోపణలు గుప్పించిన విపక్షాలు
- ఇటీవల ఏసీబీ సోదాలు
- ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఏసీబీ
- ఇప్పటివరకు 15 మంది సిబ్బందిపై వేటు
అమ్మవారి ఆలయంలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం 15 మంది సిబ్బందిపై వేటు వేసింది. వారిలో ఐదుగురు సూపరింటిండెంట్ స్థాయి అధికారులు ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి సురేశ్ ను బదిలీ చేసిన సర్కారు, త్వరలోనే ఆయనపైనా సస్పెన్షన్ వేటు వేసే అవకాశముందని తెలుస్తోంది.