అవసరం తీరాక ఆడుకుంటారు... 'చావు కబురు చల్లగా' చిత్రంలో అనసూయ ఐటమ్ సాంగ్
- మాస్ డ్యాన్స్ తో రెచ్చిపోనున్న అనసూయ
- అనసూయ ఫొటోలు విడుదల చేసిన చిత్రబృందం
- కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా చిత్రం
- ఆసక్తికరంగా ట్వీట్ చేసిన అనసూయ
అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'చావు కబురు చల్లగా' చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది.
కాగా, తన మాస్ సాంగ్ పై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన పోస్టుపై అనసూయ ఊర మాస్ లెవల్లో స్పందించింది. "అవసరమని వేడుకుంటారు.... అవసరానికి వాడుకుంటారు... అవసరం తీరాక ఆడుకుంటారు" అంటూ పాట తీరుతెన్నులను చెప్పకనే చెప్పింది.