రామతీర్థం చేరుకున్న చంద్రబాబు... నినాదాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు
- రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికివేత
- మండిపడుతున్న విపక్షాలు
- చంద్రబాబు రాక నేపథ్యంలో రామతీర్థంలో ఉద్రిక్తత
- మెట్ల మార్గం ద్వారా కొండపైకి పయనమైన చంద్రబాబు
కాగా, రామతీర్థం చేరుకున్న చంద్రబాబు మెట్ల మార్గం మొదట్లో కొబ్బరికాయ కొట్టి కొండపైకి పయనమయ్యారు. ఆయన వెంట ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు తదితరులున్నారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని తల నరికిన దుండగులు అక్కడున్న కోనేరులో పడేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.