Corona Virus: తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు

new  317 COVID19 infections in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,84,391
  • కోలుకున్న వారు 2,76,244 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,529
తెలంగాణలో గత 24 గంటల్లో  317 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 536 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,84,391కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,76,244 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,529కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,618 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,535 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి.
  
Corona Virus
COVID19
Telangana

More Telugu News