ఇటు సీఎం, అటు ప్రధాని మంచి మనసు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా: సోమిరెడ్డి
- అమరావతి రైతులు, మహిళలు 365 రోజులుగా పోరాటం చేస్తున్నారు
- అయినప్పటికీ జగన్ మనసు కరగడం లేదు
- కేంద్రంలోనూ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారు
- మంచి నిర్ణయం తీసుకోకపోతే ప్రజలు క్షమించరు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నారని, సిక్కు మత గురువు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని మోదీ ఇటువంటి పరిస్థితిని ఎందుకు తెచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు.
రైతులకు అనుకూలంగా ప్రకటన చేయాల్సిన బాధ్యత మోదీకి ఉందని చెప్పారు. అలాగే, ఇక్కడ అమరావతి రాజధాని విషయంలోనూ, రైతుల విషయంలో ఇటు సీఎం జగన్, అటు ప్రధాని నరేంద్ర మోదీ మంచి మనస్సు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని, లేదంటే ప్రజలు క్షమించరని అన్నారు.