Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Stock markets ends in losses
  • 110 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 18 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా నష్టపోయిన నెస్లే ఇండియా
నిన్న భారీ లాభాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మదుపుదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 44,149కి పడిపోయింది. నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 12,968 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (1.63%), బజాజ్ ఆటో (1.36%), టెక్ మహీంద్రా (1.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.12%), టాటా స్టీల్ (1.07%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-4.42%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-3.39%), ఓఎన్జీసీ (-2.31%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.22%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.76%).
Sensex
Nifty
Stock Market

More Telugu News