ఉద్ధండరాయునిపాలెంకు చేరుకున్న అమరావతి రైతులు, మహిళల మహాపాదయాత్ర
- అమరావతికి మోదీ శంకుస్థాపన చేసి నేటికి ఐదేళ్లు
- 'అమరావతి చూపు మోదీ వైపు' పేరుతో వినూత్న నిరసనలు
- ఈ రాత్రి 'అమరావతి వెలుగు' పేరుతో కాగడాల ప్రదర్శన
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 310 రోజులుగా ఉద్యమం జరుగుతున్నా ప్రభుత్వంలో చలనమే లేదని మండిపడ్డారు. అమరావతిని చంపేయాలనే ఉద్దేశంతో అభివృద్ది పనులన్నింటినీ ఆపేశారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ స్పందించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానికే దిక్కులేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని చెప్పారు.