అంతర్వేది విధుల్లో ఉన్న ఎస్పీ, ఏఎస్పీలకు కరోనా
- ఎస్పీ అద్నాన్ నయీం, ఏఎస్పీ కరణం కుమార్లకు కరోనా
- మరో పదిమంది పోలీసులకు కూడా
- జిల్లాలో మొత్తం 850 మంది పోలీసులకు సోకిన మహమ్మారి
ఆలయ రథం దగ్ధమైన తర్వాత అంతర్వేదిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి రోజూ నిరసనలు జరుగుతుండడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.