Raghurama Krishnaraju: వైఎస్సార్ నిలువెత్తు చిత్రపటానికి గులాబీ పూలతో అభిషేకం చేసిన రఘురామకృష్ణరాజు

MP Raghurama Krishnaraju pays tributes to late YSR
షార్ట్స్‌లో చూడండి
ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి. ఆయన ఈ లోకాన్ని విడిచి 11 ఏళ్లయింది. సీఎం జగన్ సహా వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా వైఎస్ కు నివాళులు అర్పిస్తూ తమ ప్రియతమ నేతను స్మరించుకుంటున్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైఎస్ చిత్రపటానికి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గులాబీ పూరేకులు చల్లుతూ వైఎస్ నిలువెత్తు చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటో సందడి చేస్తోంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు ట్విట్టర్ లో పంచుకున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి నా నివాళులు... జోహార్ వైఎస్సార్ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Raghurama Krishnaraju
YSR
Death Anniversary
Tribute
YSRCP
Andhra Pradesh

More Telugu News