సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రెస్ నోట్... క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు
- పెద్ది సినిమాకు లైన్ క్లియర్ అంటూ ప్రెస్ నోట్ వైరల్
- ఫిల్మ్ ఛాంబర్ పేరుతో వైరల్ అయిన ప్రెస్ నోట్పై స్పందించిన సురేష్ బాబు
- అది ఫేక్ నోట్ అని, తాము అధికారికంగా జారీ చేయలేదని వెల్లడి
- సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న ఛాంబర్
- 'పెద్ది' సినిమా ప్రదర్శనపై ఎలాంటి నిర్ణయం జరగలేదని స్పష్టీకరణ
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పేరుతో 'పెద్ది' సినిమా విడుదలపై సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రెస్ నోట్పై అధ్యక్షుడు, నిర్మాత డి.సురేష్ బాబు స్పందించారు. ఆ ప్రెస్ నోట్ ఫేక్ అని, ఛాంబర్ నుంచి తాము అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
'పెద్ది' సినిమా ప్రదర్శనకు ఎగ్జిబిటర్లు అందరూ ఆమోదం తెలిపారని, ఆ చిత్రానికి లైన్ క్లియర్ అయిందంటూ ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో విస్తృతంగా ప్రచారమైంది. అయితే, దీనిపై స్పందించిన సురేష్ బాబు, ఆ నోట్తో ఛాంబర్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానంపై ఛాంబర్ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.
కొంతకాలంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ విధానంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ క్రమంలో సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో అద్దె, పర్సంటేజీ విధానంపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. 'పెద్ది' చిత్రాన్ని అద్దె విధానంలో ప్రదర్శించలేమని కొందరు ఎగ్జిబిటర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ వాడివేడి చర్చల అనంతరం, సురేష్ బాబు సంతకం లేకుండా ఈ ఫేక్ ప్రెస్ నోట్ బయటకు రావడం గమనార్హం.
మొత్తంగా, 'పెద్ది' చిత్ర విడుదలపై ఎలాంటి అడ్డంకులు లేవని వచ్చిన వార్తలు అవాస్తవమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న ఫేక్ ప్రెస్ నోట్ ఇదే...
'పెద్ది' సినిమా ప్రదర్శనకు ఎగ్జిబిటర్లు అందరూ ఆమోదం తెలిపారని, ఆ చిత్రానికి లైన్ క్లియర్ అయిందంటూ ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో విస్తృతంగా ప్రచారమైంది. అయితే, దీనిపై స్పందించిన సురేష్ బాబు, ఆ నోట్తో ఛాంబర్కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానంపై ఛాంబర్ ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు.
కొంతకాలంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ విధానంపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ క్రమంలో సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో అద్దె, పర్సంటేజీ విధానంపై సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. 'పెద్ది' చిత్రాన్ని అద్దె విధానంలో ప్రదర్శించలేమని కొందరు ఎగ్జిబిటర్లు చెప్పినట్లు తెలిసింది. ఈ వాడివేడి చర్చల అనంతరం, సురేష్ బాబు సంతకం లేకుండా ఈ ఫేక్ ప్రెస్ నోట్ బయటకు రావడం గమనార్హం.
మొత్తంగా, 'పెద్ది' చిత్ర విడుదలపై ఎలాంటి అడ్డంకులు లేవని వచ్చిన వార్తలు అవాస్తవమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న ఫేక్ ప్రెస్ నోట్ ఇదే...