Plane Crash: కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో రెండు ముక్కలైన విమానం... పైలెట్ సహా ఇద్దరి మృతి

Plane crashes at Kozhikode airport as pilot died
షార్ట్స్‌లో చూడండి
భారీ వర్షాలతో అల్లాడిపోతున్న కేరళలో విమాన ప్రమాదం జరిగింది. కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ విమానం రన్ వేపై నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో విమాన పైలెట్ సహా ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

దుబాయ్ నుంచి కోజికోడ్ వచ్చిన ఈ విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న సమయంలో రన్ వే పై నుంచి జారిపోయింది. ప్రమాదంలో ఈ బోయింగ్ విమానం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం కోజికోడ్ విమానాశ్రయంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. గాయపడిన వారిని కోజికోడ్ లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Go Back to Shorts
Plane Crash
Kozhikode
Kerala
Pilot
Dubai
Airindia

More Telugu News