Somu Veerraju: చిరంజీవి నివాసానికి వెళ్లిన ఏపీ బీజేపీ కొత్త చీఫ్

ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.  హైదరాబాదులోని తన నివాసానికి వచ్చిన సోము వీర్రాజును చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర బీజేపీ పగ్గాలు అందుకున్న సోము వీర్రాజును చిరంజీవి శాలువతో సత్కరించారు. సరికొత్త బాధ్యతల్లో రాణించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' చిత్ర నిర్మాత ఎస్వీ బాబు కూడా సోము వీర్రాజుతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు.
Somu Veerraju
Chiranjeevi
Hyderabad
Babu SV
Andhra Pradesh
BJP

More Telugu News