Corona Virus: తెలంగాణలో కొత్తగా 1,524 కరోనా కేసులు, 10 మంది మృతి

New corona cases today in telangana
  • జీహెచ్ఎంసీ పరిధిలో 815 కొత్త కేసులు
  • తాజాగా 1,161 మంది డిశ్చార్జి
  • గత 24 గంటల్లో 10 మంది మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,524 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 37,745కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 815 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ 1,161 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 24,840కి పెరిగింది. ప్రస్తుతం 12,531 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా 10 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం మరణాలు 375కి పెరిగాయి.
Corona Virus
Telangana

More Telugu News