Bangladesh: బంగ్లాదేశ్ లో విషాద ఘటన... బోటు మునిగి 30 మంది దుర్మరణం

Boats collided in Bangladesh
షార్ట్స్‌లో చూడండి
బంగ్లాదేశ్ లో రెండు బోట్లు ఢీకొన్న ఘటనలో 30 మంది మృతి చెందారు. అనేకమంది ప్రయాణికులు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలో బురిగంగ నదిలో ఈ ప్రమాదం సంభవించింది. 'మార్నింగ్ బర్డ్' అనే పేరున్న బోటు 100 మంది ప్రయాణికులతో వెళుతుండగా, మరో బోటు వెనుకనుంచి ఢీకొంది. దాంతో ఆ బోటు నీటిలో మునిగిపోయింది. ఇప్పటివరకు 30 మృతదేహాలను వెలికితీశారు. వారిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, అవడానికి చిన్నదేశమే అయినా బంగ్లాదేశ్ లో 230 వరకు నదులున్నాయి. ఎక్కువ శాతం ప్రయాణాలు నదీ మార్గాల ద్వారానే జరుగుతుంటాయి. దాంతో నదుల్లో ప్రమాదాల శాతం కూడా ఎక్కువే.
Go Back to Shorts
Bangladesh
Boat
Accident
Capsize
River

More Telugu News