సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సోషల్ మీడియాకు దూరంగా త్రిష
- రవితేజ 'క్రాక్' షూటింగ్ అప్ డేట్
- నిర్మాతగా మారుతున్న దర్శకుడు
* రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'క్రాక్' చిత్రానికి సంబంధించి ఇక పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి వుంది. ఆగస్టులో ఈ షూటింగును నిర్వహించాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.
* పవన్ కల్యాణ్ హీరోగా రూపొందే ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న హరీశ్ శంకర్ త్వరలో నిర్మాతగా కూడా మారనున్నారు. గీతా ఆర్ట్స్ కు సంబంధించిన బన్నీ వాసుతో కలసి చిత్ర నిర్మాణం చేబట్టడానికి హరీశ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.