Tamilnadu: చిత్తూరు కలెక్టర్ జోక్యంతో... రోడ్లపై కట్టిన గోడలను కూల్చేసిన తమిళనాడు అధికారులు!

Wall on Borders Removed Near Chittore
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లా పరిధిలోని పలు మండలాల నుంచి తమిళనాడుకు దారితీసే రహదార్లపై వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు నిర్మించిన గోడలను అధికారులు తొలగించారు. పలమనేరు - గుడియాత్తం, సంగమంగళం - వేలూరు, చిత్తూరు - తిరుత్తణి మార్గాల్లోని సరిహద్దుల వద్ద తమిళనాడు అధికారులు గోడలను నిర్మించగా, ఈ వార్త వైరల్ అయింది. ఈ అడ్డుగోడల వద్ద ఇరు రాష్ట్రాల రైతులూ ఇబ్బందులు పడుతున్నారని చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఆయన, తమిళనాడు అధికారులను సంప్రదించి, గోడల కారణంగా ఏర్పడుతున్న నష్టాన్ని వివరించారు. వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో నిర్మించిన గోడలను అధికారులు కూల్చి వేశారు.
Go Back to Shorts
Tamilnadu
Border
Wall
Remove
Chittoor District
Collector
Bharat Gupta

More Telugu News