దేశీయ రూట్లలో మే 4 నుంచి విమానసర్వీసులు నడపనున్న ఎయిరిండియా

Air India resumes domestic services from May first week
  • మే 3తో ముగియనున్న నేషనల్ లాక్ డౌన్
  • టికెట్ల బుకింగ్ పునరుద్ధరించిన ఎయిరిండియా
  • అంతర్జాతీయ రూట్లలో జూన్ 1 నుంచి విమానాలు
కరోనా బీభత్సాన్ని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనుండగా, ఆ మరుసటి రోజు నుంచే దేశీయ రూట్లలో సర్వీసులు నడపాలని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నిర్ణయించింది. ఈ మేరకు బుకింగ్స్ ను పునరుద్ధరించింది. ఇక భారత్ నుంచి ఇతర దేశాల ప్రయాణాలకు మరికొంతకాలం ఆగకతప్పదు.

 ఇతర దేశాల్లోనూ కరోనా లాక్ డౌన్లు కొనసాగుతున్నందున జూన్ 1 నుంచి ఇంటర్నేషనల్ రూట్లలో విమానాలు నడుపుతామని ఎయిరిండియా పేర్కొంది. ప్రస్తుతానికి మే 4 నుంచి ముంబయి, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు వంటి ఎంపిక చేసిన మెట్రో నగరాలకు విమాన సర్వీసులు నిర్వహించనున్నారు. చవకధరల విమానయాన సంస్థ ఇండిగో కూడా మే 4 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇదేబాటలో ఇతర విమానయాన సంస్థలు కూడా మే మొదటి వారం నుంచి సర్వీసులు పునఃప్రారంభించే అవకాశాలున్నాయి.
Go Back to Shorts
Air India
Domestic
Lockdown
International
Indigo
Corona Virus

More Telugu News