కదిలిన పగిడిద్దరాజు... 'మేడారం జాతర'కు పోటెత్తిన భక్తజనం!
- ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర
- సమ్మక్క - సారక్క జాతరకు సర్వం సిద్ధం
- రేపు సాయంత్రం జాతర మొదలు
ఆపై 6వ తేదీ ఉదయం అసలు కార్యక్రమం మొదలవుతుంది. తొలుత సారక్కను గద్దెపైకి చేరుస్తారు. ఆపై మేడారం సమీపంలోని చిలుకలగుట్టపై ఉన్న సమ్మక్కను గిరిజన పూజారులు గద్దెపైకి తీసుకుని వస్తారు. ఆ సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా మూడు రౌండ్ల కాల్పులను జరుపుతారు. అదే రోజు పగిడిద్దరాజు - సమ్మక్కల వివాహ మహోత్సవం సంప్రదాయ ప్రకారం జరుగుతుంది.
రెండు రోజుల వేడుక అనంతరం, నాగవెల్లి జాతర నిర్వహించి, వన దేవతలను తిరిగి వనంలోకి పంపించడంతో అధికారికంగా జాతర ముగుస్తుంది. ఆపై పగిడిద్ద రాజును పూర్వపు స్థానానికి చేర్చే కార్యక్రమం జరుగుతుంది. కాగా, తెలంగాణలో ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకునే నిమిత్తం మొత్తం 33 మంది సభ్యులున్న యునెస్కో బృందం మేడారం జాతరలో పాలుపంచుకునేందుకు వచ్చింది.