ఆ గ్రామంలో సంక్రాంతికి పందుల పోటీ.. ఉత్సాహంగా పాల్గొనే వరాహాలు!

షార్ట్స్‌లో చూడండి

సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు, ఎడ్ల పందాలు, గొర్రెపందాలు జరగడం సర్వసాధారణం. ముఖ్యంగా ఉభయగోదావరి, క్రష్ణా జిల్లాల్లో భారీగా పందాలు జరుగుతుంటాయి. అయితే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలోని ఓ సామాజిక వర్గం వారు పండుగ రోజు పందుల పోటీలు నిర్వహించి, తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. 

తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని వీరు క్రమం తప్పకుండా ఆచరించి సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పోటీదారులు తమ పందులతో హాజరు కావడం విశేషం. ఎటువంటి జీవహింస లేకుండా ఆరోగ్యకరమైన విధానంలో ఈ పోటీ జరుగుతుందని, తోకముడిచి పారిపోయిన పంది ఓడిపోయినట్టు భావించి మిగిలిన దాన్ని విజేతగా ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం మరో విశేషం.

Go Back to Shorts
West Godavari District
tadepalligudem
pigs fight

More Telugu News