ఏపీలో నేటి నుంచి, టీఎస్ లో రేపటి నుంచి వానలు!
- రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త
- రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి
- ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనానికి అవకాశం
ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చని హెచ్చరించారు. కాగా, నిన్న ఏపీలో పలు ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే, నాలుగు నుంచి ఏడు డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.