సభలో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైన జయప్రద... ఓదార్చిన బీజేపీ కార్యకర్తలు!
- యాసిడ్ పోస్తామని బెదిరించారు
- నా వెనుక ఇప్పుడు బీజేపీ ఉంది
- ఇంకెప్పుడూ ఏడ్వను
తన పుట్టినరోజుకు బీజేపీ ఇచ్చిన కానుక ఈ ఎంపీ టికెట్ అని తెలిపారు. తన ప్రసంగం మధ్యలో ఉద్విగ్నతకు గురైన జయప్రద కాసేపు మాట్లాడలేకపోయారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తలు వేదికపైకి వచ్చి జయప్రదకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికలు ముగిసేవరకు జయప్రదకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తామంటూ ప్రతినబూనారు. దాంతో ఆమె తిరిగి ఉత్సాహం పుంజుకున్నారు. ఈరోజు తనవెంట బీజేపీ సైన్యం తోడుందని, మరెప్పుడూ ఏడ్వనని కళ్లు తుడుచుకుని మళ్లీ ప్రసంగం కొనసాగించారు.