కేసీఆర్ ను కలిసిన రెండు రోజులకే... తన ఎంపీని చంద్రబాబు వద్దకు పంపిన నవీన్ పట్నాయక్!
- బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా కూటమి
- ఆదివారం నవీన్ పట్నాయక్ తో కేసీఆర్ చర్చలు
- సౌమ్యా రంజన్ పట్నాయక్ తో లేఖను పంపిన నవీన్
మరోసారి బీజేపీ రాకూడదన్నది తమ సీఎం అభిప్రాయమని చంద్రబాబుతో చెప్పిన సౌమ్యా రాజన్, ఈవీఎంలకన్నా, బ్యాలెట్ పేపర్లపైనే తమకు ఎక్కువ విశ్వాసముందని అన్నారు. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే అంశాన్ని కంప్యూటర్ చిప్ లను తయారు చేసే మేనేజర్ల చేతిలో పెట్టడం ప్రమాదకరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సౌమ్యా రంజన్ కూడా అంగీకరించారు. వీరిద్దరి భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు కూడా పాల్గొన్నారు.