అభివృద్ధిని అడ్డుకోవడమే మహాకూటమి లక్ష్యంగా పెట్టుకుంది: ఎంపీ బాల్క సుమన్
- తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారు
- ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం
- ఇవ్వని హామీలనూ కేసీఆర్ అమలు చేశారు
ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఇవ్వని హామీలను కూడా కేసీఆర్ అమలు చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతులు అడగకుండానే పెట్టుబడి నిమిత్తం ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా అందిస్తున్నామని చెప్పారు.