కేజ్రీవాల్ కు షాకిచ్చిన అశుతోష్.. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా!
- ఆమోదించాలని పార్టీకి విజ్ఞప్తి
- వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నానని స్పష్టీకరణ
- రాజ్యసభ ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న నేత
రాజీనామా విషయాన్ని అశుతోష్ ట్విట్టర్ లో ప్రకటించారు. ‘ ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుంది. ఆప్ తో నా ప్రయాణం విప్లవాత్మకం, అద్భుతమైనది. దీనికి కూడా ముగింపు ఉంది. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. నా రాజీనామాను అంగీకరించాలని పార్టీని కోరుతున్నా. ఇన్నాళ్లు పార్టీకి, నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు అశుతోష్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆప్ కు రాజీనామా సమర్పించారు.