జైట్లీ ప్రసంగంలో వినిపించని తెలుగు రాష్ట్రాల పేర్లు.. తెలుగు ప్రజల్లో ఆగ్రహం!

  • విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావన కూడా లేదు
  • తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి
  • టీడీపీ నేతల అసహనం
కేంద్ర బడ్జెట్ లో ఇరు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొండి చేయి చూపించారు. ఏపీ ప్రజలు గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ అంశం కనీసం ప్రస్తావనకు కూడా రాలేదు. బెంగళూరు మెట్రోకు రూ. 17 వేల కోట్లు, ముంబై సబర్బన్ రైల్వేకు రూ. 17 వేల కోట్లను కేటాయించిన జైట్లీ... తెలుగు రాష్ట్రాలకు ఏమీ ప్రకటించలేదు. దీంతో, తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామంటూ గతంలో ఇచ్చిన హామీ ఏమైందంటూ టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 
Go Back to Shorts
Arun Jaitly
budget
208-19 budget
Andhra Pradesh
Telangana

More Telugu News