పబ్లిసిటీ కోసం ‘జన్మభూమి’ సభల్లో కొంతమంది గొడవలు సృష్టిస్తున్నారు: సీఎం చంద్రబాబు
- ఇచ్ఛాపురంలో నిర్వహించిన ‘జన్మభూమి’లో చంద్రబాబు
- ‘జన్మభూమి’ని రాజకీయాలకు వేదికగా చేయాలనుకుంటున్నారు
- నిన్న పులివెందులలో ఎంపీ గలాటా సృష్టించాలని ప్రయత్నించారు
ఆ సభలో అక్కడి ఎంపీ గలాటా సృష్టించాలని ప్రయత్నించారని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమపాళ్లలో అందిస్తున్నామని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా ‘1100’కు ఫోన్ చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్ట్ గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తికానుందని, ఇది కనుక పూర్తయితే ఇచ్ఛాపురం వరకు నీరిస్తామని అన్నారు. వంశధార- నాగావళి అనుసంధానానికి, శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని, ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు.