మే నెలలో తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం

Tirumala Temple Sees Record Influx of Devotees and Income in May
  • మే నెలలో తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం
  • వేసవి సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు
  • 25 లక్షల మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం
  • హుండీ ద్వారా రూ. 120 కోట్లకు పైగా కానుకలు
  • 12 లక్షల మందికి పైగా తలనీలాలు సమర్పణ
తిరుమల శ్రీవారి ఆలయానికి మే నెలలో భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, విద్యాసంస్థలకు విరామం కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో మే మాసంలో శ్రీవారి దర్శనాలు, హుండీ ఆదాయం, తలనీలాల సమర్పణలో కొత్త రికార్డులు నమోదైనట్లు టీటీడీ తాజాగా గణాంకాలను విడుదల చేసింది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మే నెలలో మొత్తం 25,46,168 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, భక్తుల రద్దీ తగ్గలేదు. రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సర్వదర్శనం భక్తులు వేచి ఉండే కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించి వారికి ఇబ్బంది కలగకుండా చూసింది.

స్వామివారిపై తమకున్న భక్తిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. మే నెలలో శ్రీవారి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో రూ.120.28 కోట్ల ఆదాయం లభించింది. ఒకే నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం తిరుమల చరిత్రలోనే అరుదు. నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా భక్తులు పెద్దఎత్తున సమర్పించారు. ఇక, మే నెలలో 12,29,773 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Go Back to Shorts
Tirumala
Tirumala temple
Tirumala devotees
Lord Venkateswara
TTD
Tirumala income
Hundi collection
Tonsure
Summer holidays
Andhra Pradesh

More Telugu News