రాజశేఖరరెడ్డి కొడుకుపై ప్రేమలేకుండా ఎందుకు ఉంటుంది?: ఉండవల్లి
- జగన్ అంటే ప్రేమ ఉంది
- కేంద్రం దగ్గర వంగి సలాములు చేయడం వల్ల అలుసైపోయాము
- చంద్రబాబు గట్టిగా నిలబడి బల్లగుద్ది ప్రశ్నిస్తే తేలిపోతుంది
వైఎస్ రాజేశేఖరరెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి మీద తనకు ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుంది? అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంగి సలాములు చేస్తున్నారని, అందుకే కేంద్రంలో ఉన్నవారికి అలుసైపోయామని అన్నారు. అలా కాకుండా చంద్రబాబు గట్టిగా నిలబడి బల్లగుద్ది ప్రశ్నిస్తే విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. ఇక చంద్రబాబు చెబుతున్న అమరావతిని తాను చూడలేనని ఆయన అన్నారు.