రోమ్లో ప్రధాని మోదీ.. మరోసారి 'మెలోడీ' సెల్ఫీ వైరల్!
- ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ
- "వెల్కమ్ మై ఫ్రెండ్" అంటూ మోదీకి స్వాగతం పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ
- సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయిన #Melodi హ్యాష్ట్యాగ్
- కొలోసియం ముందు దిగిన సెల్ఫీని ఎక్స్లో పంచుకున్న మెలోనీ
- ఇరు దేశాల నేతల మధ్య జరగనున్న పలు ద్వైపాక్షిక చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో చివరి అంకానికి చేరుకున్నారు. నిన్న ఆయన ఇటలీ రాజధాని రోమ్లో అడుగుపెట్టగా, ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీతో తన స్నేహాన్ని చాటుతూ, "రోమ్కు స్వాగతం మిత్రమా!" అంటూ మెలోనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు. ఇటలీ, భారత జెండాల ఎమోజీలను కూడా జతచేశారు.
ఈ పోస్ట్తో పాటు రోమ్లోని చారిత్రక కొలోసియం ముందు ప్రధాని మోదీతో కలిసి దిగిన సెల్ఫీని కూడా ఆమె పంచుకున్నారు. దాంతో ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో ఇరు దేశాల నేతల మధ్య స్నేహబంధంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రధాని మోదీ, జార్జియా మెలోనీల స్నేహం గురించి సోషల్ మీడియాలో "#Melodi" (మెలోడీ) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడం కొత్తేమీ కాదు. గతంలో పలు సందర్భాల్లో వారిద్దరూ పంచుకున్న ఫొటోలు, వీడియోలు సంచలనం సృష్టించాయి. 2024 జూన్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా "హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్" అంటూ మోదీతో కలిసి మెలోనీ చేసిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. దీనికి ప్రధాని మోదీ "భారత్-ఇటలీ స్నేహం వర్ధిల్లాలి!" అని బదులిచ్చారు.
అంతకుముందు 2023లో దుబాయ్లో జరిగిన కాప్28 వాతావరణ సదస్సులో ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీని "కాప్28లో మంచి స్నేహితులు. #మెలోడీ" అనే క్యాప్షన్తో మెలోనీ పంచుకున్నారు. ప్రతీ సమావేశంలోనూ ఇలాంటి ఆత్మీయ ఫొటోలు వారి మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలను సూచిస్తున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధాని మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పలు కీలక దౌత్యపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇవాళ ఆయన భారత్కు తిరుగు ప్రయాణం కానున్నారు.
ఈ పోస్ట్తో పాటు రోమ్లోని చారిత్రక కొలోసియం ముందు ప్రధాని మోదీతో కలిసి దిగిన సెల్ఫీని కూడా ఆమె పంచుకున్నారు. దాంతో ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్లతో ఇరు దేశాల నేతల మధ్య స్నేహబంధంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రధాని మోదీ, జార్జియా మెలోనీల స్నేహం గురించి సోషల్ మీడియాలో "#Melodi" (మెలోడీ) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడం కొత్తేమీ కాదు. గతంలో పలు సందర్భాల్లో వారిద్దరూ పంచుకున్న ఫొటోలు, వీడియోలు సంచలనం సృష్టించాయి. 2024 జూన్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా "హలో ఫ్రమ్ ది మెలోడీ టీమ్" అంటూ మోదీతో కలిసి మెలోనీ చేసిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. దీనికి ప్రధాని మోదీ "భారత్-ఇటలీ స్నేహం వర్ధిల్లాలి!" అని బదులిచ్చారు.
అంతకుముందు 2023లో దుబాయ్లో జరిగిన కాప్28 వాతావరణ సదస్సులో ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీని "కాప్28లో మంచి స్నేహితులు. #మెలోడీ" అనే క్యాప్షన్తో మెలోనీ పంచుకున్నారు. ప్రతీ సమావేశంలోనూ ఇలాంటి ఆత్మీయ ఫొటోలు వారి మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని, రెండు దేశాల మధ్య పెరుగుతున్న సత్సంబంధాలను సూచిస్తున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లాతో సమావేశం కానున్నారు. అనంతరం ప్రధాని మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. పలు కీలక దౌత్యపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇవాళ ఆయన భారత్కు తిరుగు ప్రయాణం కానున్నారు.