తమిళనాడు విరుదునగర్లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
- ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలోనే 60 మంది కార్మికులు
- ఆసుపత్రికి తీవ్రంగా గాయపడిన బాధితుల తరలింపు
- కొనసాగుతున్న సహాయక చర్యలు, దట్టంగా కమ్ముకున్న పొగ
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తూ, లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పలువురిని అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.