డిజిటల్ పేమెంట్స్: గంట సేపు ఆగాల్సిందే... మోసాల కట్టడికి ఆర్బీఐ ప్రతిపాదన
దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రతిపాదనలు చేసింది. రూ.10,000కు పైబడిన ఆన్లైన్ లావాదేవీలను ఒక గంట పాటు హోల్డ్ లో ఉంచే (నిలిపివేత) విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు గురువారం ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసి, ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది.
ఈ ప్రతిపాదన ప్రకారం, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపితే, ఆ లావాదేవీ వెంటనే పూర్తికాదు. బదులుగా, పంపిన వారి వద్ద గంట పాటు నిలిచిపోతుంది. ఈ సమయంలో, డబ్బు పంపిన వ్యక్తికి తన లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే, బ్యాంకు మరోసారి నిర్ధారణ కోరుతుంది. వ్యాపార చెల్లింపులు, ఈ-మాండేట్లు, నాచ్ లావాదేవీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
2025 నాటికి దేశంలో డిజిటల్ మోసాల విలువ రూ.22,930 కోట్లకు చేరడంతో ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. మొత్తం మోసాల విలువలో సుమారు 98.5 శాతం.. రూ.10,000కు పైబడిన లావాదేవీల ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి మోసగాళ్లు డబ్బు బదిలీ చేయిస్తున్నారని, ఈ గంట సమయం ఆలస్యం వల్ల బాధితులకు ఆలోచించుకునే అవకాశం దొరుకుతుందని ఆర్బీఐ పేర్కొంది.
ఇదే చర్చా పత్రంలో ఆర్బీఐ మరికొన్ని ప్రతిపాదనలను కూడా చేర్చింది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు రూ.50,000కు మించి చేసే లావాదేవీలకు వారు నామినేట్ చేసిన 'విశ్వసనీయ వ్యక్తి' ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించింది. ఖాతాల్లోకి వచ్చే పెద్ద మొత్తాల జమలపై సమీక్ష, అలాగే అన్ని డిజిటల్ చెల్లింపులను ఒకేసారి నిలిపివేసే 'కిల్ స్విచ్' వంటివి ఇతర ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై మే 8వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని వాటాదారులను ఆర్బీఐ కోరింది. వచ్చిన స్పందనల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేయనుంది.
ఈ ప్రతిపాదన ప్రకారం, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రూ.10,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపితే, ఆ లావాదేవీ వెంటనే పూర్తికాదు. బదులుగా, పంపిన వారి వద్ద గంట పాటు నిలిచిపోతుంది. ఈ సమయంలో, డబ్బు పంపిన వ్యక్తికి తన లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే, బ్యాంకు మరోసారి నిర్ధారణ కోరుతుంది. వ్యాపార చెల్లింపులు, ఈ-మాండేట్లు, నాచ్ లావాదేవీలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
2025 నాటికి దేశంలో డిజిటల్ మోసాల విలువ రూ.22,930 కోట్లకు చేరడంతో ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. మొత్తం మోసాల విలువలో సుమారు 98.5 శాతం.. రూ.10,000కు పైబడిన లావాదేవీల ద్వారానే జరుగుతున్నాయని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి మోసగాళ్లు డబ్బు బదిలీ చేయిస్తున్నారని, ఈ గంట సమయం ఆలస్యం వల్ల బాధితులకు ఆలోచించుకునే అవకాశం దొరుకుతుందని ఆర్బీఐ పేర్కొంది.
ఇదే చర్చా పత్రంలో ఆర్బీఐ మరికొన్ని ప్రతిపాదనలను కూడా చేర్చింది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు రూ.50,000కు మించి చేసే లావాదేవీలకు వారు నామినేట్ చేసిన 'విశ్వసనీయ వ్యక్తి' ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించింది. ఖాతాల్లోకి వచ్చే పెద్ద మొత్తాల జమలపై సమీక్ష, అలాగే అన్ని డిజిటల్ చెల్లింపులను ఒకేసారి నిలిపివేసే 'కిల్ స్విచ్' వంటివి ఇతర ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై మే 8వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని వాటాదారులను ఆర్బీఐ కోరింది. వచ్చిన స్పందనల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేయనుంది.