Nara Lokesh: ఏపీ యువతకు ఉగాది కానుక.. 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్!
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ యువతకు ఉగాది కానుకగా 'ఉద్యోగాల పండగ'ను ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
తన యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం సంతోషంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో, వాటి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో స్పష్టం చేస్తూ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినట్లు వివరించారు. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి, ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని, సిలబస్ను కూడా ముందుగానే అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.
ఉద్యోగార్థులు అందరూ 'నైపుణ్యం పోర్టల్' నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందని, తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని లోకేశ్ అన్నారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతకుముందు, నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సర్వశుభాలు కలగాలని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తన యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం సంతోషంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో, వాటి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో స్పష్టం చేస్తూ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసినట్లు వివరించారు. నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి, ప్రకటించిన అన్ని పోస్టులను భర్తీ చేస్తామని, సిలబస్ను కూడా ముందుగానే అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.
ఉద్యోగార్థులు అందరూ 'నైపుణ్యం పోర్టల్' నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందని, తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని లోకేశ్ అన్నారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
అంతకుముందు, నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సర్వశుభాలు కలగాలని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.