Ram Gopal Varma: ‘శివ’ చైల్డ్ ఆర్టిస్ట్ సుష్మకు క్షమాపణ చెప్పిన వర్మ.. ఇప్పుడామె ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసా?
- 'శివ' సినిమాలోని బాలనటి సుష్మ ఫొటోను పంచుకున్న వర్మ
- యూఎస్లో ఏఐ సైంటిస్ట్గా పనిచేస్తున్నట్టు వెల్లడి
- సైకిల్ ఛేజ్ సీన్లో రిస్కీ షాట్స్ పట్ల క్షమాపణలు కోరిన ఆర్జీవీ
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీ ‘శివ’ గురించి, అందులోని సైకిల్ ఛేజ్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆ సీన్లో నటించిన బాలనటికి దర్శకుడు రామ్గోపాల్ వర్మ 36 ఏళ్ల తర్వాత క్షమాపణలు చెప్పారు. ఆ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలియజేస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘శివ’ సినిమాలో హీరో నాగార్జున అన్నయ్య కూతురిగా సుష్మ అనే బాలనటి నటించింది. ఆమెను హీరో సైకిల్పై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా విలన్లు వెంబడించే సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలిచింది. ఆ సీన్ను గుర్తుచేసుకుంటూ సుష్మ ఇప్పటి ఫొటోను వర్మ షేర్ చేశారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కాగ్నిటివ్ సైన్స్లో రీసెర్చ్ చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా సుష్మను క్షమాపణ కోరుతూ వర్మ ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘సుష్మ.. నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. ఆ రిస్కీ షాట్తో నువ్వు ఎంతగా భయపడ్డావో ఒక దర్శకుడిగా అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. దయచేసి అంగీకరించు’’ అని వర్మ విజ్ఞప్తి చేశారు.
అత్యంత ప్రమాదకరమైన ఆ సైకిల్ ఛేజ్ సీక్వెన్స్ను ఎలాంటి డూప్ లేకుండా చిత్రీకరించినట్టు హీరో నాగార్జున సైతం ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఆ సీన్లో నటించిన చిన్నారి భద్రతపై వర్మ ఇప్పుడు స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ‘శివ’ సినిమాను ఈ తరం ప్రేక్షకుల కోసం ఈ నెల 14న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా వర్మ పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘శివ’ సినిమాలో హీరో నాగార్జున అన్నయ్య కూతురిగా సుష్మ అనే బాలనటి నటించింది. ఆమెను హీరో సైకిల్పై ఆసుపత్రికి తీసుకెళ్తుండగా విలన్లు వెంబడించే సన్నివేశం సినిమాకే హైలైట్గా నిలిచింది. ఆ సీన్ను గుర్తుచేసుకుంటూ సుష్మ ఇప్పటి ఫొటోను వర్మ షేర్ చేశారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), కాగ్నిటివ్ సైన్స్లో రీసెర్చ్ చేస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా సుష్మను క్షమాపణ కోరుతూ వర్మ ఓ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘సుష్మ.. నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. ఆ రిస్కీ షాట్తో నువ్వు ఎంతగా భయపడ్డావో ఒక దర్శకుడిగా అప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. దయచేసి అంగీకరించు’’ అని వర్మ విజ్ఞప్తి చేశారు.
అత్యంత ప్రమాదకరమైన ఆ సైకిల్ ఛేజ్ సీక్వెన్స్ను ఎలాంటి డూప్ లేకుండా చిత్రీకరించినట్టు హీరో నాగార్జున సైతం ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఆ సీన్లో నటించిన చిన్నారి భద్రతపై వర్మ ఇప్పుడు స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ‘శివ’ సినిమాను ఈ తరం ప్రేక్షకుల కోసం ఈ నెల 14న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా వర్మ పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.