Khushboo Pipliya: భర్త పైశాచికత్వం.. భార్యను కట్టేసి, వేడి కత్తితో చిత్రహింసలు!
- మధ్యప్రదేశ్లో దారుణం
- భార్యను తాళ్లతో కట్టేసి వేడి కత్తితో కాల్చిన భర్త
- నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి హింస
- భర్త నుంచి తప్పించుకుని కుటుంబానికి ఫోన్ చేసిన బాధితురాలు
- భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యపై ఓ భర్త పైశాచికంగా ప్రవర్తించాడు. కట్నం తీసుకురాలేదన్న కోపంతో ఆమెను తాళ్లతో బంధించి, వేడి కత్తితో శరీరంపై పలుచోట్ల వాతలు పెట్టాడు. నొప్పితో ఆమె కేకలు వేయడంతో ఆ కత్తిని ఆమె నోట్లో పెట్టేందుకు ప్రయత్నించి అత్యంత పాశవికంగా హింసించాడు. ఈ నరకం నుంచి బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకుంది.
బాధితురాలు ఖుష్బూ పిప్లియా (23) పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచే భర్త తనను ఇష్టపడటం లేదని, వేధించడం మొదలుపెట్టాడని తెలిపింది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను మొదట విచక్షణారహితంగా కొట్టాడు. ఆ తర్వాత వంటగదిలోకి ఈడ్చుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేశాడు. తుపాకీ లాంటి వస్తువును తలకు గురిపెట్టి బెదిరించి, వేడి కత్తితో ఛాతీ, చేతులు, కాళ్లపై తీవ్రంగా అంటించాడు. “మా వాళ్లు నిన్ను బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు” అని పదేపదే అంటూ దాడి చేసినట్లు ఖుష్బూ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ దాడి జరుగుతున్నప్పుడు ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది.
సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఖుష్బూ ఎలాగోలా తన కట్లను విప్పుకుని అక్కడి నుంచి తప్పించుకుంది. ఇంట్లో పనిచేసే సిబ్బంది నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి లోకేశ్ వర్మ, వెంటనే తన చిన్న కుమారుడిని పంపి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఖుష్బూ నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బాధితురాలు ఖుష్బూ పిప్లియా (23) పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచే భర్త తనను ఇష్టపడటం లేదని, వేధించడం మొదలుపెట్టాడని తెలిపింది. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్త ఆమెను మొదట విచక్షణారహితంగా కొట్టాడు. ఆ తర్వాత వంటగదిలోకి ఈడ్చుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేశాడు. తుపాకీ లాంటి వస్తువును తలకు గురిపెట్టి బెదిరించి, వేడి కత్తితో ఛాతీ, చేతులు, కాళ్లపై తీవ్రంగా అంటించాడు. “మా వాళ్లు నిన్ను బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు” అని పదేపదే అంటూ దాడి చేసినట్లు ఖుష్బూ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ దాడి జరుగుతున్నప్పుడు ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది.
సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఖుష్బూ ఎలాగోలా తన కట్లను విప్పుకుని అక్కడి నుంచి తప్పించుకుంది. ఇంట్లో పనిచేసే సిబ్బంది నుంచి మొబైల్ ఫోన్ తీసుకుని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న ఆమె తండ్రి లోకేశ్ వర్మ, వెంటనే తన చిన్న కుమారుడిని పంపి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. బాధితురాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఖుష్బూ నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.