Minor Girl: మాజీ ప్రియుడిపై మైనర్ బాలిక ప్రతీకారం... బట్టలిప్పి మరీ కొట్టారు!
- ప్రేమ వ్యవహారాలు బయటపెడతానని బెదిరించడమే కారణం
- కొత్త ప్రియుడితో కలిసి కిడ్నాప్కు ప్లాన్
- నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బట్టలిప్పి దాడి
- మైనర్ బాలిక సహా మొత్తం 8 మంది అరెస్ట్
- బాలికను పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు
ప్రేమ విఫలమవ్వడంతో, మాజీ ప్రియురాలి పాత ప్రేమ వ్యవహారాలను ఆమె కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించిన ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, నగ్నంగా మార్చి దారుణంగా దాడి చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. ఈ దారుణానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జూన్ 30న నగర శివార్లలోని సోలదేవనహళ్లి పరిధిలోని హేసరఘట్టలో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న 17 ఏళ్ల మైనర్ బాలికను అధికారులు మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, బాధితుడు, మైనర్ బాలిక గతంలో ప్రేమించుకున్నారు. కొన్ని నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం ఆ బాలిక మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియుడు, ఆ బాలికకు ఫోన్ చేసి నిలదీశాడు. ప్రేమ వ్యవహారాలు పెట్టుకుని, మధ్యలోనే వదిలేయడం ఆమెకు అలవాటుగా మారిందని, ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించాడు.
ఈ బెదిరింపుల విషయాన్ని ఆ బాలిక తన కొత్త ప్రియుడికి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన అతను, తన స్నేహితులతో కలిసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం, ఆ బాలిక సహాయంతోనే మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని హేసరఘట్ట సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ బాధితుడి బట్టలు విప్పించి, నగ్నంగా మార్చి బెత్తాలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, మైనర్ బాలికతో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఈ ఘటన గతేడాది సినీ నటుడు దర్శన్ కేసును గుర్తుకు తెస్తోంది. తన స్నేహితురాలు పవిత్ర గౌడ గురించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడనే ఆరోపణలతో రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో బెదిరింపులకు పాల్పడిన యువకుడిపై దాడి జరగడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, బాధితుడు, మైనర్ బాలిక గతంలో ప్రేమించుకున్నారు. కొన్ని నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం ఆ బాలిక మరో యువకుడితో సన్నిహితంగా ఉండటం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియుడు, ఆ బాలికకు ఫోన్ చేసి నిలదీశాడు. ప్రేమ వ్యవహారాలు పెట్టుకుని, మధ్యలోనే వదిలేయడం ఆమెకు అలవాటుగా మారిందని, ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించాడు.
ఈ బెదిరింపుల విషయాన్ని ఆ బాలిక తన కొత్త ప్రియుడికి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన అతను, తన స్నేహితులతో కలిసి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం, ఆ బాలిక సహాయంతోనే మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని హేసరఘట్ట సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ బాధితుడి బట్టలు విప్పించి, నగ్నంగా మార్చి బెత్తాలతో తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, మైనర్ బాలికతో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
ఈ ఘటన గతేడాది సినీ నటుడు దర్శన్ కేసును గుర్తుకు తెస్తోంది. తన స్నేహితురాలు పవిత్ర గౌడ గురించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడనే ఆరోపణలతో రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో బెదిరింపులకు పాల్పడిన యువకుడిపై దాడి జరగడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.