వాళ్లు చనిపోవాలనుకున్నారు, నేను సాయం చేశా అంతే.. జపాన్ ట్విట్టర్ కిల్లర్

Japan Executes Takahiro Shiraishi in Twitter Killer Case
  • టోక్యోలో 9 మందిని చంపిన సైకో కిల్లర్‌కు మరణశిక్ష అమలు
  • బాధితుల్లో 8 మంది మహిళలు, ఒక పురుషుడు
  • మహిళలపై అత్యాచారం చేసి చంపినట్లు విచారణలో వెల్లడి
  • 2020లోనే మరణశిక్ష ఖరారు, తాజాగా అమలు చేసిన ప్రభుత్వం
జపాన్‌ను తీవ్రంగా భయపెట్టిన 'ట్విట్టర్ కిల్లర్' కేసులో నిందితుడికి మరణశిక్ష అమలు చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని 9 మందిని దారుణంగా హత్య చేసిన తకహిరో షిరైషిని టోక్యో డిటెన్షన్ హౌస్‌లో ఉరితీసినట్లు జపాన్ అధికారులు ప్రకటించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ భయానక అధ్యాయానికి ముగింపు పలికినట్లయింది.

2017లో టోక్యోలోని షిరైషి అపార్ట్‌మెంట్‌లో ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడి మృతదేహాలను పోలీసులు కనుగొనడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని షిరైషి లక్ష్యంగా చేసుకున్నాడు. ట్విట్టర్ ద్వారా వారిని సంప్రదించి, చనిపోవడానికి తాను సహాయం చేస్తానని నమ్మించి తన ఫ్లాట్‌కు రప్పించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. బాధితులైన ఎనిమిది మంది మహిళలపై షిరైషి లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత వారిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మృతుల్లో టీనేజర్లు కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యల పరంపరతో అతనికి 'ట్విట్టర్ కిల్లర్' అనే పేరు స్థిరపడింది.

ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం షిరైషిని దోషిగా తేల్చి 2020లోనే మరణశిక్ష విధించింది. అయితే, దేశంలో మరణశిక్షలను రద్దు చేయాలంటూ నిరసనలు జరగడంతో మూడేళ్లుగా జపాన్‌లో ఉరిశిక్షల అమలు నిలిచిపోయింది. తాజాగా ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేయడంతో 'ట్విట్టర్ కిల్లర్' కథ ముగిసింది.
Go Back to Shorts
Takahiro Shiraishi
Japan Twitter killer
Twitter killer
serial killer
Tokyo
murder case
social media
crime news
Japan crime
Shiraishi apartment

More Telugu News