హైకోర్టులో బండి సంజయ్కు స్వల్ప ఊరట.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
- పాత కేసుల కొట్టివేతకు బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు
- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే హరీశ్ బాబు పిటిషన్లు
- బండి సంజయ్, హరీశ్ బాబులకు వ్యక్తిగత హాజరు నుంచి ఉపశమనం
- ఎంపీ లక్ష్మణ్ కేసులను మరో ధర్మాసనానికి మార్చాలని రిజిస్ట్రీకి సూచన
- విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం
పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, బండి సంజయ్, హరీశ్ బాబులకు ఊరట కల్పించింది. కింది కోర్టుల్లో వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎంపీ లక్ష్మణ్కు సంబంధించిన కేసుల విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. అనంతరం, ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేసింది.