Bandi Sanjay: హైకోర్టులో బండి సంజయ్‌కు స్వల్ప ఊరట.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు

Bandi Sanjay Gets Relief in High Court Case
షార్ట్స్‌లో చూడండి
తమపై గతంలో నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే హరీశ్ బాబు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, బండి సంజయ్‌, హరీశ్ బాబులకు ఊరట కల్పించింది. కింది కోర్టుల్లో వారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎంపీ లక్ష్మణ్‌కు సంబంధించిన కేసుల విచారణను వేరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు. అనంతరం, ఈ పిటిషన్లపై తదుపరి విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేసింది.
Go Back to Shorts
Bandi Sanjay
Telangana High Court
BJP
K Laxman
Harish Babu
Court Case
Telangana Politics
Case Dismissal Plea

More Telugu News