Shehbaz Sharif: అసిమ్ మునీర్ కు ఫేక్ ఫొటో గిఫ్ట్ గా ఇచ్చి నవ్వులపాలైన పాక్ ప్రధాని షరీఫ్

Shehbaz Sharif Gifted Fake Photo to Asim Munir Faces Ridicule
షార్ట్స్‌లో చూడండి
భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన దాడులతో విరుచుకుపడి శత్రు సంహారం చేయడం యావత్ ప్రపంచం చూసింది. కానీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తామే గెలిచామంటూ ఓ నకిలీ ఫోటోతో నవ్వులపాలయ్యారు. తమ సైనిక విజయంగా చెప్పుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన పాకిస్థాన్ పరువును మరింత దిగజార్చింది.

పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌ భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్దిష్ట దాడులు చేపట్టింది.... అందులో విజయవంతం అయింది. అయితే, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, తమ సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ బున్యాద్-ఉల్-మర్సూస్’కు గుర్తుగా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు ఓ ఫ్రేమ్ చేసిన ఫోటోను బహుమతిగా ఇచ్చారు. అయితే, ఆ ఫోటో పాకిస్థాన్ సైన్యానికి సంబంధించినది కాకపోవడమే ఇక్కడ అసలు విషయం. అది 2019లో చైనా సైన్యం నిర్వహించిన రాకెట్ ఆర్టిలరీ విన్యాసాలకు సంబంధించిన చిత్రం. వివిధ రక్షణ వెబ్‌సైట్లలో బహిరంగంగా అందుబాటులో ఉన్న ఈ చైనా ఫోటోను తమ సైనిక పరాక్రమానికి ప్రతీకగా చూపించుకునేందుకు పాక్ నాయకత్వం ప్రయత్నించడం హాస్యాస్పదంగా మారింది.

ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ నేత బీఎల్ శ్రీనివాస్ సోలంకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, "సైనిక విన్యాసాల నకిలీ ప్రదర్శనలో పాకిస్థాన్ కొత్త అట్టడుగు స్థాయికి చేరింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్, జనరల్ అసిమ్ మునీర్‌కు 2019 నాటి చైనా రాకెట్ డ్రిల్ ఫోటోను బహూకరించి, దానిని ఆపరేషన్ బున్యాద్-ఉల్-మర్సూస్ గా పేర్కొన్నారు. అది జాతీయ అవమానం" అని విమర్శించారు. మరో యూజర్, "పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు 2019 నాటి చైనా సైనిక విన్యాసాల ఫోటోను ఇచ్చి, దానిని 2025లో భారత్‌పై జరిపిన ఆపరేషన్ బున్యాన్-ఉమ్-మర్సూస్‌గా చిత్రీకరించారు" అని వ్యంగ్యంగా రాశారు.
Go Back to Shorts
Shehbaz Sharif
Pakistan
Asim Munir
China
Military Exercise
Fake Photo
Operation Bunyad-ul-Marsus
Indian Army
Terrorist Camps
BL Srinivas Solanki

More Telugu News