సీఐడీ కస్టడీకి పోసాని
- సీఐడీ పోలీసుల కస్టడీ వినతిని ఆమోదించిన న్యాయస్థానం
- గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
- అనుచిత వ్యాఖ్యల కేసులో విచారించనున్న అధికారులు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లపై పోసాని గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు మార్ఫింగ్ చేసిన చిత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాఫ్తులో భాగంగా గుంటూరు జిల్లా జైలులో ఉన్న పోసానిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.