ఎస్ఎల్బీసీ ప్రమాదం... ఇంకా ప్రారంభం కాని రెస్క్యూ ఆపరేషన్
- ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది
- పదమూడు గంటలుగా టన్నెల్లోనే ఎనిమిది మంది
- ప్రమాద ప్రాంతంలో నీరు, బురద, మట్టి ఉన్నట్లు గుర్తింపు
ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితిపై వారు సమీక్షించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.