ఉప ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్
- పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- సుప్రీంకోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని కేటీఆర్ ధీమా
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని చెప్పారు. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ కేడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.